రెండు సినిమాలకు సైన్ చేసిన సాయి ధరమ్ తేజ్.. షూటింగ్ ఎప్పటినుంచంటే?

మెగాహీరో సాయిధరమ్ తేజ్ సెప్టెంబర్ 10వ తేదీ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదం తర్వాత తీవ్ర గాయాలపాలైన సాయిధరమ్ తేజ్ విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఇంటికే పరిమితమయ్యారు.

ఈయనకు ప్రమాదం జరిగిన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఆయనకు కాలర్ బోన్ సర్జరీ జరగడం వల్ల వైద్యులు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.

ఈక్రమంలోనే ఇంటికే పరిమితమైన సాయి తేజ్ చేతిలో ప్రస్తుతం ఎలాంటి సినిమాలు లేవు.రిపబ్లిక్ సినిమా పూర్తి కాగానే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించే ముందు ఈ ప్రమాదం జరగడంతో సాయి తేజ్ ఎలాంటి సినిమాలకు ఒప్పుకోలేదు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎలాంటి సినిమాలు లేకపోవడంతో ఇంటికే పరిమితమైన సాయిధరమ్ గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement

ఇంటిలోనే రెస్ట్ తీసుకుంటూ సాయి ధరమ్ తేజ్ సినిమా కథలను వింటున్నట్లు సమాచారం.కార్తీక్ అనే ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథ సాయి తేజ్ కి నచ్చడంతో వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అలాగే తన బావ వరుణ్ తేజ్ తో కలిసి సాయి తేజ్ ఒక మల్టీ స్టారర్ చిత్రంలో చేయబోతున్నారని ఈ సినిమాకి సంబంధించిన కథ కూడా సిద్ధమైందని తెలుస్తోంది.

ఇలా సాయి తేజ్ ప్రమాదం తర్వాత రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అయితే వీటి గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.కాకపోతే ఈ సినిమాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో ప్రారంభమవుతాయని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు