నన్ను పనికిరానివాడు అంటూ దూషించడం వల్లే...!

రాజస్థాన్‌ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చినట్లే.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ రాజస్థాన్‌లో కూడా అధికారం నుండి దిగాల్సి వస్తుందా అనే ఆందోళనను అధినాయకత్వం వ్యక్తం చేసింది.

సచిన్‌ పైలెట్‌ వర్గంను ఎలాగైనా పార్టీలోనే ఉంచేందుకు తీవ్రంగా చర్చలు జరిపింది.మరో వైపు సచిన్‌ పైలెట్‌కు కూడా మరో మార్గం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సొంత పార్టీలోకి సచిన్‌ వర్గం రావాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఈ సమయంలో సచిన్‌ మీడియాతో మాట్లాడుతూ సీఎం అశోక్‌ గహ్లోత్‌పై సున్నితంగా విమర్శలు చేశారు.రాజకీయాల్లో వ్యక్తిగత శత్రుత్వం అస్సలు పనికి రాదు.

అసూయ అస్సలు ఉండకూడదు.కాని తన బాస్‌, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ తనను ఒక పనికిరానివాడు అంటూ దూషించాడు.

Advertisement

నేను ప్రభుత్వంను కూలదోషేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను అంటూ అధినాయకత్వంకు ఫిర్యాదు చేశారు.అయినా కూడా నేను ఓపిక పట్టాను.

వ్యక్తిగతంగా ఆయన పట్ల గౌరవం ఉంది.ఆయన వ్యాఖ్యలకు నేను అదే స్థాయిలో విమర్శలు చేయవచ్చు.

కాని నాకుటుంబం అలాంటి వ్యాఖ్యలను నాకు నేర్పించలేదు.నేను గడచిన 20 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఒక లక్ష్మణ రేఖ గీసుకుని ముందుకు నాకు నేను ముందుకు వెళ్తున్నాను.

ఈ క్రమంలో కొందరు నన్ను విమర్శించినా పట్టించుకోకుండా తన బాధ్యతలు నిర్వర్తిస్తానంటూ సచిన్‌ పైలెట్‌ అన్నాడు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు