రాములమ్మ డైలాగ్ తో రెచ్చిపోయిన రోజా...

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా ఘాటుగా సాగుతున్నాయి.

అంతేగాక ఇప్పటికే వికేంద్రీకరణ బిల్లు అంశంపై శాసనసభ మండలి రద్దు చేసేందుకు వైయస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ్ ఇస్తుండగా వైకాపా పార్టీ చెందినటువంటి నగరి ఎమ్మెల్యే రోజా సరిలేరు నీకెవ్వరు సినిమాలోని లేడీ సూపర్ స్టార్ విజయశాంతి డైలాగుతో రెచ్చిపోయారు.గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు అంటూ ప్రసంగించారు.

అయితే దీనికి వివరణ ఇస్తూ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ఎన్నికల ముందు నిరంతరంగా తమ నాయకుడు అయినటువంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడని, ఇప్పుడు ఆ కష్టాలను తీర్చేందుకు ప్రజలకు అనుగుణమైనటు వంటి పథకాలను ప్రవేశపెడుతూ వారి కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.

అంతేకాక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు.నారా లోకేష్ ని ఉద్దేశించి దద్దమ్మ , దద్దోజనం వంటి పదాలను ఉపయోగించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.శాసన మండలిని రద్దు చేయాలన్నఅంశంతో తాను ఏకీభవిస్తున్నానని కూడా తెలిపారు.

Advertisement

అయితే ఇది ఇలా ఉండగా నారా లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి రోజాపై పలువురు టీడీపీ నేతలు మండిపడుతున్నారు.దేవాలయం లాంటి అసెంబ్లీలో ఉంటూ అసభ్య పదజాలంతో ఉపయోగిస్తూ ప్రతిపక్ష నాయకులను దూషించడం సరికాదన్నారు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు