ఆ కమెడియన్ కు ఈగో ఎక్కువ.. రోజా షాకింగ్ కామెంట్స్..?

స్టార్ యాంకర్ రోజా జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చారు.

గత నెల రోజులుగా సర్జరీలు చేయించుకోవడం వల్ల ఇంటికే పరిమితమైన రోజా తాజాగా రిలీజైన జబర్దస్త్ ప్రోమోలో దర్శనమివ్వడంతో పాటు తనదైన శైలిలో పంచ్ లు వేశారు.

ఒకవైపు నగరి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు జబర్దస్త్ షోకు జడ్జిగా ఉంటూ రోజా పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు.రాజకీయాలతో పాటు బుల్లితెరపై కూడా రోజా ముద్ర వేస్తున్నారు.

అయితే సినిమాలకు మాత్రం రోజా దూరంగానే ఉండటం గమనార్హం.తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా జబర్దస్త్ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆ షోకు జబర్దస్త్ షోకు జడ్జిగానే కొనసాగుతున్నారు.

జబర్దస్త్ షో ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి ఒక విధంగా రోజా కారణమని చెప్పవచ్చు.నియోజకవర్గంలో ప్రజల కష్టాలను తీరుస్తూనే రోజా జబర్దస్త్ షోకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

Advertisement

అదిరే అభి రాముతో 5 రూపాయల నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉంటే మార్కెట్ లో 50 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పగా రాము నేను నేను హౌలాగానిలా కనిపిస్తున్నానా ? అని అంటారు.రోజా వెంటనే డౌటా అంటూ రివర్స్ లో కౌంటర్ వేస్తారు.ఆ తరువాత అద్దం లేదా మీ ఇంట్లో అంటూ రోజా రాము పరువు తీసేశారు.

ఆ తరువాత రోజా చలాకీ చంటికి ఈగో ఎక్కువంటూ పంచ్ వేశారు.ఆ తర్వాత చలాకీ చంటిని కొట్టమని అతని టీమ్ లో ఉన్నవారికి రోజా చెప్పారు.

ఆ తరువాత ఇమ్మాన్యుయేల్ టీమ్ అలిగే ఫ్యామిలీ అంటూ స్కిట్ చేశారు.రోజా రీఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు లాక్ డౌన్ వల్ల జబర్దస్త్ షో, ఎక్స్ట్రా జబర్దస్త్ షో ఆగిపోతాయంటూ ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు