ఈ హీరోయిన్ మీకు గుర్తుందా..?

తెలుగులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కె.

విజయభాస్కర్ దర్శకత్వం వహించినటువంటి నువ్వే కావాలి చిత్రంలో లవర్ బాయ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటించినటువంటి ముద్దుగుమ్మ రిచా పల్లాడ్ ఇప్పటికీ అందరికీ బాగానే గుర్తుంటుంది.

అయితే తెలుగులో హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినటువంటి ఈ అమ్మడు అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది.అయితే తమిళం మరియు హిందీ లో మాత్రం వరుస అవకాశాలు దక్కించుకున్నప్పటికీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోకపోవడంతో సినీ కెరీర్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయింది.

అయితే రిచా పల్లాడ్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో పుట్టి పెరిగింది.అందువల్ల సౌత్ ఇండియా భాషలు అయినటువంటి తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించింది.

అయితే కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో సినీ పరిశ్రమలో చెందినటువంటి వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది.అంతేగాక అతడిని పెళ్లి కూడా చేసుకుంది.

Advertisement

దాంతో ప్రస్తుతం రిచా పల్లాడ్ కి ఒక ఒక బాబు కూడా ఉన్నాడు.ప్రస్తుతం రిచా పల్లాడ్ తన భర్తకు సాయంగా ఉంటూ కుటుంబ బాధ్యతలను చక్కబెట్టుకునే పనిలో పడింది.

అయితే చివరిగా రిచా పల్లాడ్ తెలుగులో ఆది పినిశెట్టి హీరోగా నటించినటువంటి "మలుపు" అనే చిత్రంలో కనిపించింది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వం వహించాడు.

అయితే ఆ తర్వాత మళ్లీ రిచా సినిమాల్లో నటించలేదు.అంతేగాక సినిమాలకి సంబందించిన ఎటువంటి కార్యక్రమాలకు హాజరు కాలేదు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు