Rekha Bhoj : లాస్ట్ లైన్ హీరో కిరణ్ పక్కన కూడా తెలుగమ్మాయిలకు ప్లేస్ లేదన్న రేఖాబోజ్.. కానీ?

తెలుగమ్మాయి రేఖా భోజ్( Rekha Bhoj ) సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.

తెలుగు సినిమాలలో తెలుగమ్మాయిలకు అవకాశాలు రావాలని టాలెంట్ ఉన్న తనలాంటి నటీమణులకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

అయితే తాజాగా ఆమె చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.గత నెలలో విడుదలైన వినరో భాగ్యము విష్ణుకథ( Vinaro Bhagyamu Vishnu Katha ) మూవీ హిట్టైన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఫ్యాన్స్ కు తెగ నచ్చింది.ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా ఓటీటీ ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంకు జోడీగా కాశ్మీర పరదేశి నటించగా ఈ బ్యూటీ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఈ బ్యూటీ మహారాష్ట్రకు చెందిన నటి కావడం గమనార్హం.

Advertisement

అయితే రేఖా భోజ్ తన పోస్ట్ లో వినరో భాగ్యము విష్ణు కథ మూవీ చాలా బాగుందని డైలాగ్ లకు అప్పడాలు, ఒడియాలు నమిలిన ఆ హీరోయిన్ తప్ప అని పేర్కొన్నారు.లాస్ట్ లైన్ హీరో అయిన కిరణ్ అబ్బవరం పక్కన కూడా తెలుగమ్మాయిలకు ప్లేస్ లేదని రేఖా భోజ్ చెప్పుకొచ్చారు.అయితే లాస్ట్ లైన్ హీరో అని రేఖా భోజ్ కామెంట్ చేయడంతో కొంతమంది కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అయితే రేఖా భోజ్ డిమాండ్ లో కూడా న్యాయం ఉందని ఎక్కువమంది చెబుతున్నారు.టాలెంట్ ఉన్న తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇస్తే టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుంది.

రేఖాభోజ్ టాలెంట్ ను చూసి ఏ డైరెక్టర్ అయినా అవకాశాలను ఇస్తారేమో చూడాలి.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు