రామ్‌, బోయపాటి మూవీ సైలెన్స్ కు కారణం ఏంటి? అఖండ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ గత చిత్రం ది వారియర్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాభవం చవి చూసింది.

ఆ సినిమా విడుదలైనప్పటి నుండి కలెక్షన్స్ లేక థియేటర్లు వేల వేల పోయాయి.

కృతి శెట్టి హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ సినిమా కు జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు.రామ్ మరో పరాజయాన్ని ది వారియర్ సినిమా తో మూట కట్టుకున్నట్లు అయ్యింది.

ఆ సినిమా ఫ్లాప్ తో రామ్ చాలా జాగ్రత్తగా పడ్డాడు.చాలా మంది దర్శకులతో సంప్రదింపులు జరిపాడు.

చివరకు బోయపాటి శ్రీను దర్శకత్వం లో సినిమా ను చేసేందుకు సిద్ధం అయ్యాడు.నందమూరి బాలకృష్ణ తో అఖండ సినిమా తర్వాత బోయపాటి శ్రీను ఏ సినిమా చేయలేదు.

Advertisement

గత ఏడాది మొత్తం బోయపాటి శ్రీను సినిమా ఏ ఒక్కటి ప్రేక్షకుల ముందుకు రాలేదు.ఏడాది చివర్లో రామ్ హీరో గా సినిమా ప్రారంభించిన బోయపాటి శ్రీను అఖండ రేంజ్ లో మరో సినిమా ను తీస్తున్నట్లుగా మీడియా ముందు పలు సందర్భాల్లో తెలియజేశాడు.

రామ్ తో ఒక సూపర్ ఎనర్జిటిక్ మాస్ మసాలా సినిమా ను బోయపాటి శ్రీను రూపొందిస్తున్నాడు అనే ప్రచారం జరుగుతోంది.బాలకృష్ణ కు మాత్రమే బోయపాటి శ్రీను సక్సెస్ లను ఇస్తాడు.ఆయన తో చేసిన సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతాయి అనే అభిప్రాయం చాలా మంది లో ఉంది.

ఆ అభిప్రాయాన్ని, ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలనే ఉద్దేశం తో బోయపాటి శ్రీను ఈ సినిమా తో సక్సెస్ దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

అదే విధంగా ఇప్పుడు అఖండ సినిమా తర్వాత రామ్ తో సినిమా చేస్తున్న బోయపాటి శ్రీను కూడా సక్సెస్ దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.మరి ఆ ప్రయత్నాల్లో భాగంగా బోయపాటి ఎలాంటి సినిమా తీయబోతున్నాడు.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

అది ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

తాజా వార్తలు