ఆ పోస్టర్ మార్చాలంటూ బుక్ మై షోకి ట్వీట్ చేసిన రాధేశ్యామ్ డైరెక్టర్ !

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పూజాహెగ్డే జంటగా జిల్ ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల 11వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో ప్రభాస్ ఆఫ్ లైన్ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించగా దర్శకుడు రాధాకృష్ణ ఆన్ లైన్ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా డైరెక్టర్ రాధాకృష్ణ అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు.

ఈ క్రమంలోనే ఓ అభిమాని బుక్ మై షో టికెటింగ్ పోర్టల్ ఉన్న పోస్టర్ మార్చాలని కోరారు.దీంతో ఈ అభిమాని కోరిక పై స్పందించిన డైరెక్టర్ రాధాకృష్ణ ఈ విషయాన్ని వెంటనే బుక్ మై షో టీమ్ కి తెలియచేస్తానని చెప్పడమే కాకుండా వెంటనే ఆయన బుక్ మై షో టీమ్ కి ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా రాధాకృష్ణ ట్వీట్ చేస్తూ.ప్రియమైన బుక్ మై షో టీమ్ ఆన్ లైన్ టికెటింగ్ పోర్టల్‌లో రాధేశ్యామ్ పోస్టర్‌ను మార్చేందుకు ప్రయత్నించడంపై దృష్టిపెట్టాలనీ రాధాకృష్ణ బుక్ మై షో టీమ్ మెంబర్స్ కి ట్వీట్ చేశారు.ఇక ఈయన ట్వీట్ కి సదరు టీమ్ స్పందించకపోవడంతో అభిమానులే పాత పోస్టర్ల స్థానంలో మరికొన్ని పోస్టర్లను మారుస్తున్నారు.

Advertisement

ఇక ప్రభాస్ అభిమానులు అలాగే డైరెక్టర్ రాధాకృష్ణ విజ్ఞప్తి మేరకు బుక్ మై షో టీం ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు