పుష్ప పరిస్థితి దారుణం.. సగానికి సగం!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బన్నీ తన నెక్ట్స్ మూవీని అప్పుడే లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.

ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు బన్నీ.కాగా ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు రెడీ అయ్యాడు సుకుమార్.

అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్.ఇప్పటికే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్, కరోనా కారణంగా షూటింగ్‌ను వాయిదా వేసుకుంది.

అయితే ఇప్పట్లో కరోనా వైరస్ విజృంభన తగ్గే సూచనలు కనిపించకపోవంతో ఈ సినిమా షూటింగ్‌ను మరింత ఆలస్యంగా మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా ఇప్పటికే ఈ సినిమా సెట్ల కోసం భారీగా ఖర్చు పెట్టిన చిత్ర యూనిట్, రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్‌ను భారీగా తగ్గించేందుకు సిద్ధమైంది.

Advertisement

అయితే తొలుత ఈ సినిమా బడ్జెట్‌ను కొంత మేర తగ్గించాలని అనుకున్నా, ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా ఈ బడ్జెట్‌ను సగానికి సగం కుదించాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.రాబోయే రోజుల్లో థియేటర్లకు జనాలు తక్కువగానే వస్తారని ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తుండటంతో, ఈ సినిమా రిలీజ్ అయ్యే నాటికి కూడా థియేటర్ల నుండి భారీ మొత్తంలో కలెక్షన్స్ రావడం అసాధ్యంగా కనిపిస్తుండటంతో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారట చిత్ర యూనిట్.

మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు