రాధేశ్యామ్‌ న్యూ ఇయర్‌ అప్‌ డేట్‌ వచ్చేసిందోచ్‌

ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చేసింది.

ఈ నెలలో సినిమా ప్యాచ్‌ వర్క్‌ తో సహా మొత్తం షూటింగ్ ను పూర్తి చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాధేశ్యామ్‌ సినిమా కోసం మరో నాలుగు రోజుల పాటు ప్రభాస్ మరియు పూజా హెగ్డేలు కలిసి నటించబోతున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లను రామోజీ ఫిల్మ్‌ సిటీలో చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

భారీ ఎత్తు అంచనాలున్న ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్‌ తర్వాత విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు.అందుకు తగ్గట్లుగా షూటింగ్‌ ను పూర్తి చేసి నిర్మాణానంతర పనులు మొదలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా విడుదల తేదీ విషయంలో సంక్రాంతికి కీలక ప్రకటన చేసేందుకు యూనిట్‌ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారట.

Advertisement

రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ ను ముగించిన వెంటనే సలార్‌ మూవీ షూటింగ్‌ లో ప్రభాస్‌ జాయిన్‌ అవ్వబోతున్నాడు.దాంతో పాటు ఆదిపురుష్‌ మూవీ విషయంలో కూడా ఇప్పటికే చర్చలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి.కనుక త్వరలోనే రాధేశ్యామ్‌ ను విడుదల చేసి ఆదిపురుష్‌ ను పట్టాలెక్కించాలని ప్రభాస్‌ భావిస్తున్నాడు.

రికార్డు స్థాయి బడ్జెట్‌ తో ఈ మూడు సినిమాలు రూపొందుతున్నాయి.ఈ మూడు మాత్రమే కాకుండా ఇంకా టైటిల్‌ ఖరారు కాని నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మూవీ కూడా అతి త్వరలో పట్టాలెక్కబోతుంది అంటూ సమాచారం అందుతోంది.

రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు అయ్యేలా దేశం మొత్తం భారీ ఎత్తున ఈ నాలుగు సినిమాలను విడుదల చేయబోతున్నారు.ఈ రెండేళ్ల కాలంలో ప్రభాస్ అయిదు వేల కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

అంతకు మించి అయినా ఆశ్చర్యం అక్కర్లేదు అంటున్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు