ప్రభాస్ ఫ్యాన్స్‌కు మళ్లీ పంగనామమే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అందరూ అంటున్నారు.

ఇక ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.కాగా ఈ సినిమాను పూర్తి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.అదిగో ఇదిగో అంటూ చిత్ర యూనిట్ కూడా ఫస్ట్ లుక్‌ను ఊరిస్తూ వస్తుండటంతో ఈ సినిమా యూనిట్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక జూన్ నెలలో ఖచ్చితంగా ప్రభాస్ 20వ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపిన సంగతి తెలిసిందే.కానీ జూన్ నెలాఖరుకు చేరుకోవడంతో ఇప్పట్లో ఈ సినిమా ఫస్ట్ లుక్ వస్తుందనే ఆశలు లేవంటున్నారు ప్రేక్షకులు.

Advertisement

కాగా ప్రభాస్ చిత్రానికి సంబంధించి ఎలాంటి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ యువీ క్రియేషన్స్‌ను గతంలోనే ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.ఇప్పుడు చిత్ర యూనిట్ అన్న మాట తప్పడంతో వారు ఎలా రెస్పాండ్ అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాకు రాధే శ్యామ్ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు