ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ను కంగారు పెడుతున్న 'ప్రాజెక్ట్‌ కే' సినిమా వార్తలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )హీరో గా మహా నటి చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్( Nag Ashwin ) దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం ప్రాజెక్ట్‌ కే( Project K movie ).

ఈ సినిమా లో బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్ కీలక పాత్ర లో కనిపించబోతున్నాడు.

అంతే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే మరో హీరోయిన్ దిశా పటాని లు ఈ సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా లో మరో కీలక పాత్ర ను యూనివర్శిల్‌ స్టార్‌ కమల్ హాసన్( Kamal hasan ) తో చేయిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇప్పటికే కమల్ హాసన్ తో చర్చలు జరిపారని, ఆయన 10 నుండి 15 రోజులు పాటు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు ఓకే చెప్పాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నారు.ఈ నేపథ్యం లో ప్రభాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంత మంది స్టార్స్ ఉంటే సినిమా కొన్ని సార్లు తల కిందులయ్యే ఆవకాశం ఉంది.

Advertisement

సాధారణంగా ఒక పడవ లో ఎంత వరకు సాధ్యమో అంత వరకు మాత్రమే ప్రయాణికులను ఎక్కించాల్సి ఉంటుంది.అలా కాదని ఎక్కువ శాతం మంది ప్రయాణికులను ఎక్కించి పడవ నడిపించాలంటే తిరగి పడే అవకాశం ఉంటుంది.ఇప్పుడు అదే పరిస్థితి ప్రాజెక్ట్‌ కే సినిమా కు రాబోతుందా అంటే కొందరు అవును అనే సమాధానం చెబుతున్నారు.

ఆ సమాధానం ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది.స్టార్ కాస్ట్ భారీ గా పెంచడం వల్ల సినిమా వెయిట్ పెరిగి తలకిందులు అయ్యే అవకాశం ఉందంటూ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే.వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు