రేషన్ షాపుల ద్వారా పోస్టల్ బ్యాంకింగ్ సేవలు:జిల్లా అదనపు కలెక్టర్

సూర్యాపేట జిల్లా: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు వారిద్వారా రేషన్ డీలర్లకు బిజినెస్ కరస్పాండెంట్ గా ఏర్పరచడానికి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా రేషన్ డీలర్లతో లావాదేవీలు జరపడానికి సన్నాహం చేస్తుందని,గ్రామీణ ప్రాంతాలలో రేషన్ డీలర్లతో బ్యాంకు సేవలు చేయుటకు ఆసక్తి కలిగిన డీలర్లు దరఖాస్తు చేసుకోవలసిందిగా జిల్లా అదనపు రెవిన్యూ కలెక్టర్ ఎస్.

మోహన్ రావు కోరారు.

శుక్రవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్ నందు జిల్లా రేషన్ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తి ఉన్న డీలర్ల అందరూ ఈ సేవలు ఉపయోగించుకుని అదనపు ఆదాయం పొందాలని సూచించారు.పోస్టల్ శాఖ ఉద్యోగి మణికంఠ రేషన్ షాపుల ద్వారా అందించనున్న ఆన్లైన్ సేవలపై డీలర్లకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో కార్యాలయ సూపర్డెంట్ సుదర్శన్ రెడ్డి,ఏసోఓ పుల్లయ్య,డిడిసిఎస్ లు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

సింహాచలం దేవస్థానం ఈవోగా వి త్రినాథ్ రావు
Advertisement

Latest Suryapet News