పుట్టినరోజు వేడుకల్లో డీజే కేసు నమోదు చేసిన పోలీసులు

నల్లగొండ జిల్లా: శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న డీజేలపై ప్రభుత్వం నిషేధం విధించింది.అయినా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో సోమవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిలుకూరు బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో కార్యకర్తలతో కలిసి జరుపుకున్నారు.

ఈ వేడుకల్లో ప్రభుత్వ అధికారుల ఉత్తర్వులను ఉల్లంఘించి, ఎటువంటి అనుమతి లేకుండా ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ఒక డీసీఎంలో డీజే బాక్స్ పెట్టి న్యూసెన్స్ క్రియేట్ చేసిన కారణంగా అట్టి డీజేను సీజ్ చేసి,చిలుకూరి బాలకృష్ణ మరియు నిర్వహాకులపై,డీజే యజమానిపై కేసులు నమోదు చేశారు.

అనుమతి లేకుండా ప్రజా శాంతికి భంగం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

బుద్ధవనంలో ధమ్మ విజయం వేడుకల్లో పాల్గొన్న గుత్తా

Latest Nalgonda News