ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో ప్రజలు మరియు పోలీసు కుటుంబాలు ఆనందంగా మరియు సుభిక్షంగా వుండాలని ఎన్.టి.
ఆర్ జిల్లా పోలీసుల ఆద్వర్యంలో విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారికి ఆషాడం సారెను సమర్పించడం జరుగుతుంది.ఈ రోజు ది.24.07.2022న ఆదివారం నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్.గారి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలిసి విజయవాడ పశ్చిమ డివిజన్ పరిధిలోని వన్ టౌన్ పోలీసు స్టేషన్ నుండి మేళ తాళాలతో అంగరంగ వైభవంగా బయలుదేరి శ్రీ కనక దుర్గమ్మ వారి దేవస్థానంనకు చేరుకొని అమ్మవారికి ఆషాడం సారె సమర్పిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.ఓ.శ్రీమతి భ్రమరాంబ గారు ఆషాడం సారే తీసుకు వస్తున్న నగర పోలీస్ కమీషనర్ గారికి స్వాగతం పలికినారు.సారే సమర్పణ అనంతరం వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్.గారు మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం ఆషాడమాసంలో ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసుల ఆద్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ వారికి ఆషాడం సారెను సమర్పించడం జరుగుతుంది.పోలీస్ కుటుంబాలు మరియు ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని మరియు ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు నిండుగా అందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ గారితో పాటు మాజీ మంత్రివర్యులు పశ్చిమ యం.ఎల్.ఏ.శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, డి.సి.పి.లు శ్రీ.బాబురావు ఐ.పి.యస్.,గారు, శ్రీ ఉదయరాణి గారు, అడిషినల్ డి.సి.పి.లు శ్రీమతి వెంకట రత్నం గారు, శ్రీ మోకా సత్తిబాబు గారు, శ్రీ కొల్లి శ్రీనివాసరావు గారు, ఏ.సి.పి.లు, ఇనస్పెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.