జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.

తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు మరువలేనివని,తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనీకుడు కాళోజీ నారాయణ రావు అని, తెలంగాణ భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన కవితల ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడుగా అభివర్ణించారు.భారత దేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తో సన్మానింప బడిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్ఫూర్తిని ప్రజలు కొనసాగించాలని కోరారు.

ఈ కార్యక్రమములో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మురళి కృష్ణ, ఆర్.ఐ లు యాదగిరి, మాధుకర్, రమేష్, ఆర్.ఎస్.ఐ, పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

తీరనున్న వేములవాడ వాసులు, రాజన్న భక్తుల కష్టాలు
Advertisement

Latest Rajanna Sircilla News