పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్

పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు( Telangana High court)లో పిటిషన్ దాఖలైంది.ఈ మేరకు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే వివేకానంద న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.

ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు( Kadiam Srihari)లపై స్పీకర్ చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ లో చేరారని తెలిపారు.వీరిపై స్పీకర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన చర్యలు తీసుకోలేదని పిటిషనర్ న్యాయస్థానానికి తెలిపారు.

అదేవిధంగా ఈ వ్యవహరంపై పలుమార్లు స్పీకర్ కు లేఖలు రాసినా స్పందించడం లేదని వివేకానంద పిటిషన్ లో వెల్లడించారు.కాగా ఈ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది.

గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత
Advertisement

తాజా వార్తలు