మహేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన పవన్!

సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా రోజుల తర్వాత ఈ మధ్యనే షూట్ లో పాల్గొన్నాడు.

ఇక అంతా బాగుంది రెగ్యురల్ షూట్ ఆగకుండా జరుగుతుంది అని అనుకునే లోపే మహేష్ ఇంట విషాదం చోటు చేసుకుంది.

మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గారి మరణంతో ఘట్టమనేని ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ రోజు ఉదయం ఇందిరా దేవి గారి మరణ వార్త విని ఘట్టమనేని వారి ఇంట మాత్రమే కాదు టాలీవుడ్ లో కూడా తీరని విషాదం చోటు చేసుకుంది.

దీంతో ఈ వార్త విని టాలీవుడ్ ప్రముఖులు మహేష్ బాబుతో పాటు సూపర్ స్టార్ కృష్ణను పరామర్శించి వారికీ ధైర్యం చెబుతున్నారు.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు మహేష్ బాబు తల్లి మరణించడంతో సంతాపం తెలిపారు.

ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.మహేష్ బాబు కుటుంబానికి ధైర్యం చెబుతూ పవన్ కళ్యాణ్ కుటుంబం పట్ల తన స్పందన తెలిపారు.

Advertisement

పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ.ప్రముఖ నటులు కృష్ణ గారి సతీమణి, శ్రీ మహేష్ బాబు గారి మాతృమూర్తి శ్రీమతి ఇందిరా దేవి గారు తుది శ్వాస విడిచారు అనే విషయం బాధ కలిగించింది.శ్రీమతి ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను.

వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను.ఈ బాధ నుండి కృష్ణ గారు, మహేష్ బాబు గారు త్వరగా కోలుకునే మనో ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడు వారికీ ఆ ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ అదిఆకృకంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.

ఇక ఇందిరా దేవి గారి అంత్యక్రియలను ఎప్పుడు, ఎలా నిర్వహిస్తారో అనే సమాచారం బయటకు వచ్చింది.ఇందిరా గారి అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జరగనున్నట్టు తెలుస్తుంది.ఈమె పార్థివ దేహాన్ని మధ్యాహ్నం వరకు పద్మాలయ స్టూడియోస్ లో ఉంచి.

ఇక ఆ తర్వాత జూబ్లీ హిల్స్ లో మహాప్రస్థానంలో ఈమె అంత్యక్రియలు జరగనున్నాయి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు