ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్( KA Paul ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రాణాలకు టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) వల్ల ముప్పు ఉందని హెచ్చరించారు.
అధికారం కోసం ఎందాకైనా తెగించడానికి చంద్రబాబు వెనుకాడే వ్యక్తి కాదని.ఆనాడు ఎన్టీఆర్ ను చంపించినట్లే పవన్ కళ్యాణ్ నీ కూడా చంపించే అవకాశం ఉందని హెచ్చరించారు.
అంతేకాదు చంద్రబాబే చంపించి దానిని జగన్ పైకి నెట్టేసిన ఆశ్చర్యపడక్కర్లేదని అన్నారు.కొడుకు లోకేష్ నీ ముఖ్యమంత్రిని చేయటం కోసం చంద్రబాబు ఎంతకైనా వెళ్తారంటూ వీడియో విడుదల చేశారు.
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్రపై కూడా కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్ తాను సీఎం అభ్యర్థిగా ప్రచార యాత్ర చేస్తున్నట్లు ప్రకటించకపోతే అతనికి ప్రాణహాని ఉందని అన్నారు.గత కొద్ది సంవత్సరాలుగా బీసీలు, కాపులలో ఎవరు ముఖ్యమంత్రి కాలేదు.
చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టిన ఆయన కాంగ్రెస్ లో విలీనం కావడంతో ప్రజలు తగ్గిన బుద్ధి చెప్పారు.ఇటువంటి పరిస్థితులలో పవన్ తాను సీఎం అభ్యర్థిని కాను అని చెప్పడం అన్యాయమే అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టీడీపీ, బీజేపీ అన్యాయం చేయటం జరిగిందని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy