క్లిక్‌ క్లిక్‌ : కోటి దీపోత్సవంలో పవన్‌ కళ్యాణ్‌

ప్రతి ఏడాది కార్తీక మాసంలో భక్తి ఛానల్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది.

ఆ కార్యక్రమంలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొంటూ ఉన్నాడు.

పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా ఈ ఏడాది కూడా కోటి దీపోత్సవ కార్యక్రమం జరిగింది.ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.

వేద పండితులు మరియు ప్రముఖులు ఈ సందర్బంగా పవన్‌ కళ్యాణ్‌ను ఆశీర్వదించారు.ప్రతి సంవత్సరం నరేంద్ర చౌదరి గారు నిర్వహిస్తున్న ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంకు రావడం చాలా సంతోషంగా ఉందని, ప్రజల్లో భక్తి భావంను పెంపొందించేందుకు మీరు చేస్తున్న పని చాలా గొప్పదంటూ అభినందించారు.

పవన్‌ కళ్యాణ్‌ హాజరు అవ్వడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్‌ స్టేడియంకు చేరుకున్నారు.పోలీసుల బందోబస్తు కూడా భారీగానే ఉంది.

Advertisement

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు