గత అనుభవాల దృష్ట్యా పవన్‌ ను నమ్ముకుని కూర్చోవద్దనుకుంటున్న దర్శకులు

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత రెండేళ్ళ గ్యాప్ తీసుకున్నాడు.కరోనా కారణంగా మరో ఏడాది కూడా గ్యాప్ వచ్చింది.

మొత్తం మూడు ఏళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది సంక్రాంతికి వకీల్‌ సాబ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఆ సినిమాతో సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చేయబోతున్న నాలుగైదు సినిమాలు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అందులో మొదటగా ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నా పవన్ కళ్యాణ్ ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు.

ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ద్వితీయార్ధం వరకు పూర్తి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నాడట.పవన్ కళ్యాణ్ తో సినిమా అనుకోని మరే ప్రాజెక్ట్ పెట్టుకోకుండా ఖాళీగా కూర్చుంటే చాలా నష్టపోవాల్సి వస్తుందని గతంలో ఇద్దరు ముగ్గురు దర్శకులకు అర్థమైంది.

కనుక ఇప్పుడు క్రిష్‌ మరియు హరీష్‌ శంకర్ లు పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేయకుండా మరో ప్రాజెక్టులను కూడా నెత్తిన వేసుకున్నారు ఇప్పటికే క్రిష్‌ మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఆ సినిమా పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Advertisement

ఇక పవన్ డేట్లు ఖాళీ అయ్యే అంత వరకు హరీష్ శంకర్ కూడా మరో ప్రాజెక్టు సిద్ధమవుతున్నారట.ఆయన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ కోసం వెబ్‌ సిరీస్‌ ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుత సినిమాలు పూర్తి అయ్యే వరకు కనీసం నాలుగు నెలలైనా పడుతుంది.కనుక ఈ నాలుగు నెలల సమయంలో ఓటీటీ కోసం ఒక మూవీ ని లేదా వెబ్‌ సిరీస్‌ ను ఇస్తే బాగుంటుంది కదా అని ఉద్దేశంతో హరీష్ శంకర్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక సురేందర్‌ రెడ్డి కి కూడా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పిన విషయం తెలిసిందే.ఆయన పవన్ కళ్యాణ్ కంటే ముందు అఖిల్ తో సినిమాకు రెడీ అయ్యాడు.

పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం టైం వృధా చేసుకోకుండా ఇతర హీరోలతో సినిమా చేయడం అనేది నిజంగా అభినందనీయం అంటూ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు