పవన్‌ తో రానా జాయిన్‌ అయ్యేది ఎప్పుడు.. యూనిట్‌ సభ్యుల మాటేంటి?

మలయాళం సూపర్‌ హిట్ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ లో పవన్ మరియు రానాలు కలిసి నటిస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయ్యింది.

షూటింగ్‌ ప్రారంభం అయ్యింది అంటూ యూనిట్‌ సభ్యులు ఒక వీడియోను కూడ ఆ విడుదల చేశారు.వీడియోలో కేవలం పవన్‌ మాత్రమే కనిపించాడు.

రానా షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వలేదేమో అంటూ ప్రచారం జరుగుతుంది.మల్టీ స్టారర్‌ మూవీ కనుక ఇద్దరు హీరోలు మొదటి రోజు షూటింగ్ లో పాల్గొంటే ఖచ్చితంగా ఆ వీడియోలో ఇద్దరికి సంబంధించిన షాట్స్‌ ఉండేవి.

కాని రానా మాత్రం వీడియోలో కనిపించలేదు.దాంతో మొదటి రోజు షూటింగ్ కు రానా హాజరు కాలేదు అని క్లారిటీ వచ్చేసింది.

Advertisement

అయితే షూటింగ్‌ లో ఆ తర్వాత నుండి రానా పాల్గొంటున్నాడు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ప్రస్తుతం రానా మరియు పవన్‌ ల కాంబో సీన్స్‌ చిత్రీకరణ జరుపుతున్నారని సమాచారం అందుతోంది.

ఈ సినిమా కోసం రానా 30 రోజులు మరియు పవన్‌ కళ్యాణ్‌ 40 రోజుల డేట్లు ఇచ్చారని సమాచారం అందుతోంది.ఒరిజినల్ వర్షన్‌ లో కంటే తెలుగు రీమేక్‌ లో పవన్ పాత్ర కాస్త ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీవర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారని వాటిని ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ ఆధ్వర్యంలో షూట్‌ చేస్తున్నారని అంటున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ ను త్రివిక్రమ్‌ దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నాడట.దాంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా చిత్రీకరణ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

ఇదే ఏడాది సినిమాను విడుదల చేస్తామని యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.కనుక పవన్‌, రానా ల మల్టీ స్టారర్‌ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా తెలుస్తోంది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు