ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో గ్లోబల్ బ్యూటీ.. ఈ వార్తల్లో నిజమెంత?

రౌద్రం రణం రుధిరం సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్.

కొమురం భీమ్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి గ్లోబల్ స్టార్ గా గొప్ప పేరు సంపాదించు కున్నాడు.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు.ఈ లిస్టులో ముందుగా కొరటాల ఉన్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర( Devara ) సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకు వేళ్ళు అప్పుడే రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది.

ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ తో టీమ్ బిజీగా ఉంది.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంటే విలన్ గా సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) ఫిక్స్ అయ్యాడు.

Advertisement

అందుకే ఈ సినిమాకు బిటౌన్ లో కూడా మంచి క్రేజ్ నెలకొంది.ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 31వ సినిమాను కూడా ఎప్పుడో ప్రకటించాడు.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రకటించాడు.ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో భారీ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా నుండి తాజాగా హీరోయిన్ గురించి మరోసారి నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంతకు ముందు దీపికా పదుకొనే పేరు వినిపించగా.ఇప్పుడు ఎన్టీఆర్ సరసన ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ బ్యూటీ గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకుని హాలీవుడ్ లో సైతం అలరిస్తుంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

అందుకే ఈమెను ఈ సినిమాలో భాగం చేస్తే బాగుంటుంది అని ఫీల్ అవుతున్నారని సమాచారం.చూడాలి ఇందులో ఎంత నిజం ఉందో.

Advertisement

తాజా వార్తలు