షాకింగ్ : 80000 మందిని కలిసిన జూనియర్ ఎన్టీఆర్ ! ..

టాలీవుడ్ లో మాస్ హీరో అంటే ఎన్టీఆర్ గుర్తొస్తాడు.చిరంజీవి తరవాత అంతగా యూత్ తో పాటు మాస్ ని కూడా ఆకట్టుకున్న స్టార్ హీరో ఇతను.

గత సినిమా నాన్నకు ప్రేమతో కాస్త క్లాస్ కానీ రాబోయే జనతా గ్యారేజ్ మంచి మాస్ సినిమా అవుతుంది అని ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ ఫాన్స్.ఈ సినిమా షూటింగ్ లో ఎడతరపి లేకుండా బిజీ గా గడుపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన అభిమానులని కూడా కలుస్తూ సెట్స్ లో పండగ వాతావరణం సృష్టిస్తున్నాడు.

అతని కెరీర్ లో చాలా ఇంపార్టెంట్ టైం లో హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న తారక్ ఫాన్స్ ని ఎక్కువ సేపు వెయిట్ చేయ్యనివ్వుండా కనీసం రోజుకి ఐదు వందల మంది ఫాన్స్ ని కలుస్తున్నాడు అని టాక్.వారితో టైం స్పెండ్ చేస్తూ వారికి ఆటోగ్రాఫ్ లు మాత్రమే కాక ఫోటోలకి ఫోజులు కూడా ఇస్తూ బిజీ గా ఉన్నాడు.

అయితే ఇది ఎప్పటి నుంచో జరుగతున్న తంతు.మొత్తం మీద ఎన్టీఆర్ ఇప్పటి వరకూ ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఎనభై వేల మంది ఫాన్స్ ని కలిసాడు అని చెబుతున్నారు.

Advertisement

అందరు ఫాన్స్ నీ జనతా గ్యారేజ్ సెట్స్ లోనే మనోడు మీట్ అవ్వడం విశేషం.ఇంతమందిని కలిసి అందరితో చిరునవ్వు నవ్వుతూ మాట్లాడ్డం అంటే అందుకేనేమో ఎన్టీఆర్ కి అంత ఫ్యాన్ బేస్ ఉంది, ఫాన్స్ ప్రాణం ఇస్తారు ఎన్టీఆర్ కోసం అనిపిస్తుంది.

Pokiri : పోకిరి సినిమా ఎందుకు ఆడిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు
Advertisement

తాజా వార్తలు