నితిన్ @20.. ఎమోషనల్ పోస్ట్ తో ప్రతి ఒక్కరిని కదిలించిన యూత్ స్టార్!

టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకరు.ఈయన తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.

అంతేకాదు ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కావడంతో పవన్ ఫ్యాన్స్ లో కూడా నితిన్ సినిమాలు అంటే క్రేజ్ ఉంది.నితిన్ తన ప్రతి సినిమాలో పవన్ కళ్యాణ్ ఏదొక సన్నివేశం కానీ పాట కానీ ఉండేలా చూసుకుంటాడు.

అయితే నితిన్ కెరీర్ స్టార్టింగ్ లో అన్ని హిట్ సినిమాలు తీసి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.వరుస ప్రేమ కథ సినిమాల్లో నటించి హిట్ కొట్టిన ఈయన ఆ తర్వాత తర్వాత మాత్రం వరుస ప్లాప్స్ ఎదుర్కొన్నాడు.

చాలా ఏళ్ల పాటు నితిన్ నటించిన సినిమాలు అన్ని కూడా వరుస ప్లాప్స్ అయ్యాయి.అయినా కూడా ఈయన ప్రయత్నం మానకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు.

Advertisement

అలా నితిన్ కు ఇష్క్ సినిమాతో లక్ కలిసి వచ్చింది.ఇక మళ్ళీ అప్పటి నుండి వరుస సినిమాలు చేస్తూ హిట్స్ కూడా అందుకుంటూ మరింత ఫాలోయింగ్ పెంచుకున్నాడు.

అయితే నితిన్ తెలుగు తెరకు పరిచయం అయ్యి 2 దశాబ్దాలు అవుతుంది.ఈయన జయం సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాడు.

ఈ క్రమంలోనే నితిన్ హీరోగా మారి 20 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ఈయన పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అందరిని ఆకట్టుకుంది.

20 ఏళ్ల నా సినీ ప్రయాణం జయం సినిమాతో స్టార్ట్ చేశాను.నన్ను నమ్మి వెండితెరకు పరిచయం చేసిన తేజ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.అలాగే నా మిగిలిన డైరెక్టర్లు, నటులు, నిర్మాతలు, టెక్నీషియన్స్ ఇలా నేను పని చేసిన వారందరికీ థాంక్స్ చెబుతున్నారు.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

ఇన్నేళ్ళుగా నన్ను అభిమానిస్తు.చెరగని ప్రేమను అందిస్తున్న అభిమానులకు అయితే ఎప్పుడు రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసారు.

Advertisement

ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.ఇక నితిన్ ప్రెసెంట్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

ప్రెసెంట్ నితిన్ తన 32వ సినిమాను రైటర్ వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాను ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై నికిత రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఈయన నటించిన మాచర్ల నియోజక వర్గం రిలీజ్ కు రెడీ అవుతుంది.ఆగష్టు 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

తాజా వార్తలు