టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన నిఖిల్ సిద్ధార్థ్ ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.ఈయన ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.
ఈ సినిమా తర్వాత నిఖిల్ అంటే పాన్ ఇండియా వ్యాప్తంగా తెలిసి పోయింది.హిందీలో కూడా ఊహించని వసూళ్లు సాధించిన ఈ సినిమా తర్వాత నిఖిల్ నెక్స్ట్ రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో నెక్స్ట్ సినిమాల క్రేజ్ కూడా బాగా పెరగడం విశేషం.
ప్రెజెంట్ నిఖిల్ 18 పేజెస్ సినిమాతో మరోసారి తన అదృష్టం పరీక్షించు కునేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.దీంతో ఈ సినిమా ప్రొమోషన్స్ కూడా జరుగుతున్నాయి.మరో పక్క ఈ సినిమా రిలీజ్ కు అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు.తాజాగా మేకర్స్ ఈ సినిమా రన్ టైం ను లాక్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ సినిమా రన్ టైం 2 గంటల 17 నిముషాలు అని తెలుస్తుంది.మరి ఇంత తక్కువ రన్ టైం తో రాబోతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను తప్పక అలరిస్తుంది అని అంతా భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాను కుమారి 21F సినిమా ఫేమ్ డైరెక్టర్ సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కిస్తున్నాడు.అలాగే టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ అందిస్తుండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో కూడా కార్తికేయ 2 జోడీనే కనిపించ బోతున్నారు.అలాగే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.చూడాలి ఈ సినిమా ఎలా అలరిస్తుందో.