ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారిన పడి చైనాలో వెయ్యి మందికి పైగా ఇప్పటి వరకు మృతి చెందినట్లు తెలుస్తుంది ఇప్పటికే 43 వేల మంది వరకూ ఈ వ్యాధి బారిన పడ్డారు.
రెండు నెలలు దాటినా ఇప్పటికీ ఈ వైరస్ ని అదుపు చేయలేకపోతున్నారు.
గత ఏడాది డిసెంబర్ లో ఈ వైరస్ వుహాన్ నగరంలో పుట్టింది.చైనా ఈ వైరస్ పై ఇప్పుడు పెద్ద యుద్ధమే చేస్తుంది.
ఈ వైరస్ కి ఎలాంటి చికిత్స, మందు లేకపోవడంతో మరింత విస్తరిస్తుంది.దగ్గు తుమ్ములు, శారీరక సంబంధం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి.
చివరికి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా ఈ వ్యాధి చెందే అవకాశం ఉందంటే ఈ వైరస్ తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.ఇప్పుడు ఈ వ్యాధి కారణంగా చైనాలో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు.
ఇండియాలో నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది మన పూర్వీకులు ఎందుకు పెట్టారో అనేది ఈ ఘోరం చూస్తే అర్ధమవుతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ కి వలన వచ్చే వ్యాధికి కొత్త పేరు పెట్టింది.
ఇకపై ఈ వైరస్ వలన వచ్చే వ్యాధిని కోవిడ్-19గా పిలవాలని నిర్ణయించింది.కరోనా వైరస్ డిసీజ్ ని సంక్షిప్త రూపంగా ఈ పేరును డబ్ల్యూహెచ్ ఓ ఖరారు చేసింది.
ఇక ఇదే పేరుతో ప్రతి ఒక్కరు కరోనా వైరస్ వ్యాధికి ఇదే పేరు ఉపయోగించాలని తెలియజేసింది.
తాజా వార్తలు
Download App
Channels
Home English News TeluguStop Exclusive Stories Flash/Breaking News Trending News Political Movie Health Tips Crime News Movie Reviews NRI News Viral Videos Bhakthi/Devotional Press Releases Viral Stories Quotes Photo Talks Baby Boy NamesBaby Girl Names Celebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.com Ph No : 999-279-9973
About Us!
About Us Jobs Advertising DMCA / Removal Terms of Use Privacy Policy