మహేష్ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఏమిటంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ కొట్టేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమా పూర్తి కాకముందే మహేష్ తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో మహేష్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు మహేష్ సిద్ధమవుతున్నాడు.గతంలో అతడు, ఖలేజా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన మహేష్-త్రివిక్రమ్ కాంబో, ఇప్పుడు మూడోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కుతుందో లేదో అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో త్రివిక్రమ్ బిజీగా ఉన్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

Advertisement

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులు చూస్తూనే, మహేస్ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా చూస్తున్నాడట ఈ డైరెక్టర్.ఇక ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని, నవంబర్ నెలలో ఈ సినిమాను పట్టాలెక్కించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట.

ఈ సినిమాతో మహేష్-త్రివిక్రమ్ కాంబో అదిరిపోయే హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా, ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనేది తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Advertisement

తాజా వార్తలు