గీతా ఆర్ట్స్ లో అంజలి.. రీమేక్ తో లక్కీ ఛాన్స్..!

మళయాళంలో సూపర్ హిట్టైన నయట్టు సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమాను తెలుగు రీమేక్ రైట్స్ గీతా ఆర్ట్స్ కొనేసింది.

సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.ఫీమేల్ సెంట్రిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలిని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

సినిమాలో హీరోగా సత్యదేవ్ నటిస్తాడని తెలుస్తుంది.తమిళ రీమేక్ ను గౌతం మీనన్ డైరెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది.

అతనితోనే తెలుగులో కూడా రీమేక్ డైరక్షన్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు.గౌతం మీనన్ కాకుంటే సుధీర్ వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.

Advertisement

సినిమాలో రావు రమేష్ కు కూడా మంచి రోల్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా తెరకెక్కించనున్నారు.

అంజలికి ఇది ఒక మంచి అవకాశమని చెప్పొచ్చు.ఈమధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో ఆమె నటించి మెప్పించింది.

ఈ సినిమా రీమేక్ పై అల్లు అర్జున్ కూడా ఇంట్రెస్ట్ చూపించినట్టు వార్తలు వచ్చాయి.అతనే గీతా ఆర్ట్స్ లో ఈ సినిమా చేయాలని రికమెండ్ చేసినట్టు టాక్.

 అల్లు అర్జున్ కు ఈ సినిమా బాగా నచ్చేసిందట.అందుకే తెలుగులో తమ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కించేలా ప్లాన్ చేశాడు.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు