హిట్ సీక్వెల్ కోసం అడవి శేష్ ని పట్టుకున్న నాని

నేచురల్ స్టార్ నాని ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే తన భార్యని నిర్మాతగా మార్చి హోం బ్యానర్ లో లో బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమాల ద్వారా కొత్త దర్శకుల ఎంకరేజ్ చేస్తూ కొత్తదనం ఉన్న కథలని తెరపైకి ఎక్కిస్తున్నాడు.

ఇప్పటికే ప్రశాంత్ వర్మని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఆ! సినిమాని, శైలేష్ కొలనుని దర్శకుడుగా పరిచయం చేస్తూ హిట్ మూవీ తెరకెక్కించాడు.ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 3 గా హిట్ మూవీ సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా గురించి నాని అఫీషియల్ ఎనౌన్స్ చేశాడు.శైలేష్ కొలను దర్శకత్వంలోనే ఈ సీక్వెల్ సినిమా తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే ఈ సారి సీక్వెల్ స్టొరీని ఆంద్రప్రదేశ్ బ్యాక్ డ్రాప్ లో మరో కేసు ఫైల్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.ఇక త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

Advertisement

ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలో హీరోగా ఈ సారి అడవి శేష్ ని తీసుకోవడానికి రెడీ అయ్యాడు.ఇప్పటికే అతనికి కథని నేరేట్ చేయడం జరిగిందని, అడవి శేష్ కూడా చేయడానికి ఒకే చెప్పాడని తెలుస్తుంది.

ప్రస్తుతం అడవి శేష్ మేజర్ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.దీని తర్వాత గూఢచారి సీక్వెల్ ని తెరకెక్కించబోతున్నాడు.

ఈ సీక్వెల్ కి సంబంధించి ఇప్పటికే ఓపెనింగ్ కూడా జరిగిపోయింది.అయితే మేజర్ సినిమాని మహేష్ బాబు బ్యానర్ లో చేస్తూ ఉండటంతో దానిని ముందుగా పూర్తి చేసి గూఢచారి సీక్వెల్ కి వెళ్లాలని అనుకుంటున్నాడు.

మరి గూఢచారితో పాటు నాని హిట్ సీక్వెల్ కూడా ఒకే సారి సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడా లేదంటే ఒకదాని తర్వాత ఒకటి చేస్తాడా అనేది వేచి చూడాలి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు