నా జీవితంలో ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ లేదు.. నమ్రత షాకింగ్ పోస్ట్ వైరల్!

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ గురించి మనందరికీ తెలిసిందే.

నమ్రత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, మహేష్ బాబు గురించి, తన ఫ్యామిలీ గురించి తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అంతే కాకుండా తన ఫ్యామిలీలో ఏదైనా స్పెషల్ ఈవెంట్ జరిగినప్పుడు ఫొటోస్, వీడియోలను పంచుకుంటూ ఉంటుంది.ఎప్పటిలాగే తాజాగా నమ్రత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న ఒక స్పెషల్ మూమెంట్ ను షేర్ చేస్తూ ఎమోషనల్ గా కామెంట్ చేసింది.

తాజాగా నమ్రత జనవరి 22న తన 50వ పుట్టినరోజు జరుపుకుంది.ఈ సందర్భంగా తన భర్త మహేష్ పిల్లలు సితార, గౌతమ్ లతో కలిసి ఎంజాయ్ చేసింది.

ఈ నేపథ్యంలోనే ఆ వేడుకలకు సంబంధించిన ఒక ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.ప్రతిరోజు పిల్లలతో జాలీగా గడపడం కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అంటూ తన ఇద్దరు పిల్లలపై ఉన్న ప్రేమను మరొకసారి బయటపెట్టింది నమ్రత.

Advertisement

ఇక ఎప్పటిలాగే నమ్రత షేర్ చేసిన ఫోటో క్షణాల్లో వైరల్ కావడం, అదేవిధంగా లక్షల్లో లైకులు కామెంట్లు వర్షం కురిసాయి.కొడుకు కూతురు అంటే మహేష్ బాబు నమ్రత లకు చాలా ఇష్టం.

మహేష్ బాబుకు, నమ్రతకు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా వారి పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడం, మెడిటేషన్ ట్రిప్స్ వేయడం లాంటివి చేస్తూ ఉంటారు.

ఇక మహేష్ బాబు ఫ్యామిలీ బాండింగ్, వారి మధ్య ఉన్న అనుబంధాలు చూసిన నెటిజన్లు ది కంప్లీట్ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ, బెస్ట్ ఫ్యామిలీ, క్యూట్ కపుల్ ఇలా రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఉంటారు.ఇకపోతే నమ్రత పెళ్లికి ముందు హీరోయిన్ అన్న విషయం అందరికి తెలిసిందే.పెళ్లి తరువాత నమ్రత సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, భర్త మహేష్ బాబు వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటూ ఉంటుంది.

ఇకపోతే తాజాగా నమ్రత షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఫోటోను చూసిన మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు