నాగ్‌, కార్తీల మూవీ టైటిల్‌?

నాగార్జున, కార్తీలు హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక భారీ మల్టీస్టారర్‌ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా కథ వివాదాస్పదం అవ్వడం వల్ల ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.

అయితే ఇటీవలే ఈ మల్టీస్టారర్‌ సినిమా తర్వాత షెడ్యూల్‌ చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించి, సినిమా ఆగిపోలేదు అంటూ చెప్పుకొచ్చారు.ఇక తాజాగా ఈ సినిమా టైటిల్‌ను దర్శకుడు వంశీ పైడిపల్లి ఫిక్స్‌ చేసినట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో నాగార్జున, కార్తీలు మంచి స్నేహితులుగా కనిపించనున్నారట.అందుకే ఈ సినిమాకు ‘దోస్త్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

త్వరలోనే ఈ టైటిల్‌ను ఫిల్మ్‌ చాంబర్‌లో నిర్మాత పొట్లూరి ప్రసాద్‌ నమోదు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా నటించనుంది.

Advertisement

తమిళ వర్షన్‌కు ఇంకా టైటిల్‌ను అధికారికంగా ఫిక్స్‌ చేయలేదు.ఇక ఈ సినిమాను ఇదే సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులున్నా .

Pokiri : పోకిరి సినిమా ఎందుకు ఆడిందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు
Advertisement

తాజా వార్తలు