డే కేర్ సెంటర్ ను సందర్శించిన ఎంపిడిఓ.

పండ్ల పంపిణీ చేసి బాగోగులు తెలుసుకున్న ఎంపిడిఓ.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రకృతి ఎన్ జి ఓ ఆధ్వర్యంలో నడుస్తున్న డే కేర్ సెంటర్ ను ఎంపిడిఓ సత్తయ్య సందర్శించారు.

డే కేర్ సెంటర్ లో గల వృద్ధులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

వారి బాగోగులు సరిగా చూసుకోవాలని డే కేర్ సెంటర్ ఇంచార్జీ మమత కు సూచించారు.ఈ సందర్భంగా వృద్దులకు పండ్ల పంపిణీ చేశారు.

డే కేర్ సెంటర్ ను సందర్శించిన ఎంపిడిఓ ఇంచార్జీ లను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమం లో ఎంపిడిఓ సత్తయ్య తో పాటు ప్రకృతి ఎన్ జి ఓ ఆర్గనైజర్ చార్లెస్,మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,యూత్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్,గంట వెంకటేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Advertisement
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శప్రాయం : కమాండెంట్ యస్.శ్రీనివాస రావు

Latest Rajanna Sircilla News