ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్ కొత్త చిత్రం `శ్రీల‌క్ష్మి & 24 కిస్సెస్‌`

`మిణుగురులు` వంటి విల‌క్ష‌ణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో కొత్త చిత్రం `శ్రీల‌క్ష్మి & 24 కిస్సెస్‌` ప్రారంభం కానుంది.

ఇది ఒక మంచి యూనిక్ ల‌వ్‌స్టోరీ, ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైనర్‌.

ఓ ప్ర‌ముఖ నిర్మాన సంస్థ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో ఓ ప్ర‌ముఖ హీరో, హీరోయిన్ న‌టించ‌నున్నారు.ఈ సంద‌ర్భంగా అయోధ్య‌కుమార్ మాట్లాడుతూ ```శ్రీల‌క్ష్మి & 24 కిస్సెస్‌` అనే టైటిల్ కొంచెం హార్డ్‌గా ఉండొచ్చు లేదా ఆస‌క్తిగానూ ఉండ‌వ‌చ్చు కానీ ఇది ప్యూర్ ల‌వ్ స్టోరీ.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో ఇటువంటి ఎంట‌ర్‌టైన్మెంట్ రాలేదు.ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించ‌నుంది.

ప్రముఖ హీరో హీరోయిన్స్ న‌టించ‌నున్నారు.అలాగే సాంకేతిక వ‌ర్గం ఈ సినిమాకు ప‌నిచేస్తున్నారు.

Advertisement

యూత్ స‌హా అన్నీ వ‌ర్గాల‌కు న‌చ్చేలా సినిమా ఉంటుంది.ప్ర‌స్తుతం.

ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.మిగిలిన టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం.

సినిమా చిత్రీక‌ర‌ణ జూలై మొద‌టి లేదా రెండో వారంలో స్టార్ట‌వుతుంది`` అన్నారు.జూన్ 22న ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్ పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.

ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?
Advertisement

తాజా వార్తలు