ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానన్న మెగాస్టార్ చిరంజీవి...

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు మృతి చెందారు.దీంతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

అయితే సినిమా వార్తలని బయట ప్రపంచానికి అందించడంలో తన వంతు పాత్ర పోషించి ఎంతో మందికి సహాయం చేసినటువంటి సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు మరణాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తాజాగా రామారావు గారి మృతి పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

జర్నలిస్ట్ పసుపులేటి రామారావు అంటే తనకు ఎంతో అభిమానమని అంతేగాక అతడిని ఒక జర్నలిస్టుగా కాకుండా తన ఆత్మ బంధువుగా చూస్తానని చిరంజీవి అన్నారు.అరామారావుకి మా కుటుంబం అంటే ఎంతో అభిమానమని అందువల్లే తన కొడుకుకి కూడా తమ ముగ్గురి మెగా బ్రదర్స్ పేర్లు కలిపి చిరంజీవి నాగ పవన్ అని పేరు పెట్టారని అన్నారు.

అంతేగాక ఈ మధ్య కాలంలో గత కొద్దికాలంగా కొంత మేర అనారోగ్యంతో బాధపడుతున్నారని సన్ షైన్ ఆసుపత్రి వైద్యులను కూడా తన ఇంటికి పంపించి చూపించామని కానీ ఉన్నట్లుండి ఇలా అకాల మరణం చెందడంతో తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు.అలాగే సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

 అంతేగాక జర్నలిస్టు రామారావు కుటుంబ సభ్యులకు ఏం అవసరం వచ్చినా తన వంతు సాయం చేస్తూ అన్ని వేళలా అండగా ఉంటానని మాట ఇచ్చారు.

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం వైఎస్ఆర్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో గ్లామర్ డాల్ త్రిష చిరంజీవి సరసన నటిస్తోంది.అంతేగాక ఈ చిత్రంలో కు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు