ప్రకృతి తన పని తాను సరిగ్గా నిర్వహించడం ఎప్పుడో మరచిపోయినట్లుగా ఉంది.లేకుంటే ఎండలు దంచికొట్టవలసిన సమయంలో వర్షాలు పడటం ఏంటీ! అప్పుడే బాగా ఉక్కపోతగా ఉండటం ఏంటీ! అంతా విచిత్రమైన ఘటనలు ఈ పరిస్దితుల్లో చోటు చేసుకోవడం గమనించే ఉంటారు.
ఇక మరోవైపు కరోనా ప్రజల జీవితాలతో చెలగాటాన్ని ఒక రేంజ్లో ఆడుకుంటుంది.ఇలాంటి విపత్కర పరిస్దితుల్లో రోడ్దు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు తరచుగా పలకరిస్తూనే ఉన్నాయి.ఇదిలా ఉండగా నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.మంగళవారం మధ్యాహ్నం కూకట్పల్లిలో స్థానికంగా ఉన్న ఏఈ ఎక్స్ప్రెస్ పార్కింగ్ యార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలో పార్క్ చేసిన పలు ఆటోలు, బైక్లు పూర్తిగా కాలిపోయినట్లుగా సమాచారం.
ఇక ఈ ప్రమాద ఘటన తాలూకూ సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారట.కాగా ఈ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో ఇంకా తెలియరాలేదు.