లండన్ లో కొత్త బిజినెస్ ప్రారంభించిన మంచు వారి కోడలు... లగ్జరీ స్టోర్ ప్రారంభించిన వేరోనికా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూనే కొందరు బిజినెస్ రంగంలో కూడా ఎంతో అద్భుతంగా రాణిస్తూ ఉంటారు.

అయితే హీరోలు మాత్రమే కాకుండా హీరోల భార్యలు కూడా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి బిజినెస్ ఉమెన్స్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు.

ఈ క్రమంలోనే మంచు వారి పెద్ద కోడలు మంచు విష్ణు సతీమణి వేరోనికా రెడ్డి సైతం బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు.అమెరికాలో పుట్టి పెరిగిన వేరోనికా అక్కడ ఆభరణాలు, జెమాలజీ, ఫ్యాషన్ మార్కెటింగ్ లో పట్టా అందుకుంది.

విష్ణుతో వివాహం తర్వాత ఆమె ఇండియాలో స్థిరపడ్డారు.

ఇలా పెళ్లి తర్వాత తన కుటుంబ సభ్యులందరికీ ఈమె ప్రత్యేకంగా డ్రెస్సులు నగలు డిజైన్ చేసేవారట ఇలా చివరికి వేరోనికా తన పేరుట ఒక బోటిక్ కూడా ప్రారంభించారు అయితే ఇలా ఇండియాలో వ్యాపారం చేస్తూ బిజీగా ఉన్నటువంటి వేరోనికా ప్రస్తుతం లండన్ లో కూడా కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టినట్టు తెలుస్తుంది.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన లండన్ హోరోడ్స్ లో ఫ్యాషన్ స్టోర్  వ్యాపారాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ స్టోర్లో చిల్డ్రన్ కోసం మైసన్ అవా పేరుతో ఈ స్టోర్ ఓపెన్ చేసింది.2 సంవత్సరాల నుంచి 14 ఏళ్ల పిల్లల వరకు ఇందులో దుస్తులు లభించనున్నాయి.అమ్మాయిలకు అబ్బాయిలకు సరికొత్త డిజైన్లతో ఇక్కడ అన్ని రకాల దుస్తులు అందుబాటులో ఉంచారట.

ఎంతో ఖరీదైన ఈ దుస్తులు మిషన్ మీద కాకుండా స్వయంగా చేతితో తయారుచేసిన దుస్తులు కావడం విశేషం.ఈ విధంగా లండన్లో తన వ్యాపారాన్ని ప్రారంభించడంతో ఈమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఎన్నో రోజులుగా తాను లండన్ లో తన బ్రాంచ్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాను ఎట్టకేలకు తన కల నిజమైందని ఈమె సంతోషం వ్యక్తం చేశారు.ఇలా లండన్ లో ఈమె కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేయడంతో అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?
Advertisement

తాజా వార్తలు