ఆస్థి విషయంలో గొడవ, అక్క మీద కోపం కుక్క మీద!

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధి లోని లాలా పేట లో గత రాత్రి అక్కా తమ్ముళ్ల మధ్య ఆస్తి గొడవ చోటుచేసుకుంది.

ఈ క్రమంలో వారిరువురు కూడా తీవ్ర స్థాయిలో తిట్టుకోవడమే కాకుండా కొట్టుకున్నారు కూడా.అయితే ఆ సమయంలో అక్క రమా దేవి కుక్క తన యజమానితో గొడవ పడుతున్న ఆమె తమ్ముడు కు అడ్డు వచ్చింది.

దీనితో కోపోద్రిక్తుడు అయిన అతడు తనకు అడ్డు వచ్చిన ఆ కుక్క ను ఏమాత్రం కనికరం లేకుండా మెడ మీద కాలు వేసి తొక్కడం తో ఆ కుక్క మృతి చెందినట్లు తెలుస్తుంది.అయితే తన కుక్కను తన తమ్ముడు కాలు వేసి తొక్కి చంపాడు అంటూ రమాదేవి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం తో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అనంతరం కుక్క కళేబరాన్ని స్థానికంగా ఒక ఆసుపత్రికి తరలించి పోస్టుమారం నిర్వహించారు.ప్రస్తుతం కుక్క ను చంపిన కేసులో రమాదేవి తమ్ముడు ని నిందితుడుగా పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు