బెంగాల్లో త్వరలో జరగున్న ఎన్నికల కోసం జరుగుతున్న ప్రచార భేరీలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.అంతే కాకుండా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ని ముప్పతిప్పలు పెడుతున్నారు కమళం నేతలు.
ఇదే క్రమంలో ఇవాళ కూచ్ బెహర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, బెంగాల్లో ముస్లిం మద్దతు ఓటర్లను దీదీ కోల్పోయిందని వ్యాఖ్యానించి మమత బెనర్జీని ఇరుకులో పడవేసారు.కాగా ఇటీవల ప్రచారంలో పాల్గొన్న మమతా బెనర్జీ ముస్లిం ఓటర్లు ఐక్యంగా ఉండాలని, ఓట్లను డివైడ్ చేయవద్దు అంటూ అన్న మాటలకు స్పందించిన మోదీ ముస్లింల ఓటు బ్యాంకును కోల్పోవడం వల్లే దీదీ అలా అభ్యర్థన చేసిందని విమర్శించారు.
ఇక అభివృద్ధి రూపంలో బెంగాలీ ప్రజలకు తన ప్రేమను చూపిస్తానని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా టీఎంసీ విజయంలో ముస్లిం ఓట్లే కీలకంగా మారనున్న క్రమంలో ఆ ఓట్ల కోసం ఇప్పుడు కొత్తగా ఎంఐఎం పోటీపడుతున్నది.