అసత్యాల ఫ్యాక్టరీ పెట్టిన మోదీ.. కేంద్రం పై భగ్గుమన్న దీదీ.. !?

కేంద్ర ప్రభుత్వానికి, మమతా బెనర్జీ కి ఎప్పుడు పడదు.అవకాశం వస్తే ఒకరినొకరు విమర్శించుకుంటారన్న విషయం తెలిసిందే.

ఇక త్వరలో బెంగాల్‌ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో బిజేపీ పై మమతా విమర్శలు చేస్తే, మమతా పై బీజేపీ నాయకులు కూడా తక్కువగాకుండా విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో నువ్వా నేనా అంటూ దూసుకు పోతున్నారు.ఈ క్రమంలోనే మమతా బెనర్జీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పై విమర్శల అస్త్రాలను వదిలింది.

అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో పురూలియా జిల్లాలో మంగళవారం జరిగిన ప్రచార ర్యాలీలో మాట్లాడిన మమత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్ముతోందని, ఇలా అమ్ముకుంటు వెళ్లితే చివరికి నరేంద్ర మోదీ అసత్యాల ఫ్యాక్టరీ ఒక్కటే మిగిలి ఉంటుందని ఎద్దేవా చేశారట.అదీగాక బెంగాలీలకు భారీ హామీలు గుప్పిస్తున్న కాషాయ పార్టీ గతంలో అసోం, త్రిపుర ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను ఎంతవరకు నెరవేర్చిందో ఆలోచించుకోవాలని విమర్శించారట.

ఇక బెంగాల్ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారో తెలియదు గానీ బిజేపీ పై మాత్రం చాలా గరంగరంగా ఉన్నట్టు మాత్రం అర్ధం అవుతుందని అనుకుంటున్నారట.

Advertisement
కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

తాజా వార్తలు