మహేష్ ఫ్యామిలీ మొదట నమ్రతను ఒప్పుకోలేదట.. అప్పుడేం చేశారంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే సంగతి తెలిసిందే.

వంశీ సినిమాలో మహేష్, నమ్రత హీరోహీరోయిన్లుగా నటించడంతో పాటు ఆ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు.

వంశీ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో జరగగా మొదట స్నేహితులుగా ఉన్న నమ్రత, మహేష్ ప్రేమికులుగా మారారు.అయితే నమ్రత మొదట లవ్ ప్రపోజ్ చేయగా ఆ తర్వాత మహేష్ కూడా నమ్రతపై ఇష్టాన్ని వ్యక్తపరిచారు.

మహేష్ నమ్రతల ప్రేమను మొదట మహేష్ ఫ్యామిలీ అంగీకరించలేదని సమాచారం.మహేష్ సోదరి మంజుల సహాయంతో కుటుంబ సభ్యులను ఒప్పించడంతో 2005 సంవత్సరంలో నమ్రత మహేష్ ల వివాహం జరిగింది.

దాదాపు ఐదు సంవత్సరాలు ప్రేమలో ఉన్న మహేష్ నమ్రత పెళ్లి బంధంతో ఒక్కటి కావడం గమనార్హం.అయితే పెళ్లి తర్వాత నమ్రత సినిమాల్లో నటించకపోయినా మహేష్ సినిమాలకు సంబంధించిన పనులను చూసుకుంటున్నారు.

Advertisement

సాధారణంగా సినిమాల్లో నటించే హీరోహీరోయిన్లు ప్రేమలో పడితే మీడియాకు ఆ విషయాలు ఏదో ఒక విధంగా లీక్ అవుతుంటాయి.

అయితే మహేష్ నమ్రత ప్రేమ గురించి మాత్రం మీడియాకు లీక్ కాలేదు.సినిమాలకు నటిగా గుడ్ బై చెప్పడం గురించి నమ్రత ఒక సందర్భంలో మాట్లాడుతూ మహేష్ ను మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్న టైమ్ లోనే సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నానని తనకు స్టార్ హీరోయిన్ కావాలనే కోరిక లేదని ఆమె అన్నారు.

ఫ్యామిలీ కొరకు మహేష్ ఏదైనా చేస్తారని సినిమా షూటింగ్ లు, ఇతర పనుల వల్ల బిజీగా ఉన్నా కుటుంబానికి తగిన సమయం కేటాయియిస్తారని నమ్రత మహేష్ గురించి వెల్లడించారు.మహేష్ బాబును మ్యారేజ్ చేసుకోవడం తన లైఫ్ లోనే స్పెషల్ గిఫ్ట్ అని నమ్రత చెప్పుకొచ్చారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు