‘బాహుబలి 2’ కోసం మాధురి దీక్షిత్‌!

‘బాహుబలి’ మొదటి పార్ట్‌ విడుదల అయిన దగ్గర నుండే రెండవ పార్ట్‌పై చర్చలు, ప్రచారాలు, పుకార్లు పుట్టుకు వస్తూనే ఉన్నాయి.

రోజుకు రెండు మూడు వార్తలు అయినా మీడియాలో ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ గురించి వస్తున్నాయి.

భారీ అంచానాల నడుమ రెండవ పార్ట్‌ను తెరకెక్కించేందుకు జక్కన్న ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను షురూ చేశాడు.డిసెంబర్‌లో రెండవ పార్ట్‌కు సంబంధించిన చిత్రీకరణ పనులు ప్రారంభం అవ్వనున్నాయి.

ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్స్‌ పలువురు నటిస్తారు అంటూ మొదటి నుండి కూడా ప్రచారం జరుగుతోంది.హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునే ఉద్దేశ్యంతో రాజమౌళి బాలీవుడ్‌ స్టార్స్‌ను ఈ సినిమాలో మెరిపించబోతున్నాడు అంటున్నారు.

అందులో భాగంగా మాధురి దీక్షిత్‌ను చిన్న ముఖ్యమైన గెస్ట్‌ రోల్‌లో నటింపజేస్తున్నారు.దేవసేనకు అక్కగా, కుంతల దేశం మహారాణిగా మాధురి దీక్షిత్‌ కనిపించనున్నట్లుగా ఫిల్మ్‌ సర్కిల్స్‌ ద్వారా సమాచారం అందుతోంది.

Advertisement

ఈమెకు జోడీగా బాలీవుడ్‌కే చెందిన మరోస్టార్‌ను సైతం అతిథిగా తీసుకు రాబోతున్నారు.బాలీవుడ్‌ స్టార్స్‌ ఎంట్రీతో ‘బాహుబలి’ రెండవ పార్ట్‌కు హిందీ ప్రేక్షకుల్లో మరింత క్రేజ్‌ పెరిగే అవకాశాలున్నాయి.

మరో బాహుబలి వస్తుందని ప్రకటన చేసిన రాజమౌళి.. ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ అంటూ? 
Advertisement

తాజా వార్తలు