జగన్ కి లెటర్ రాసిన లోకేష్..!!

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వైయస్ జగన్ కి లోకేష్ లెటర్ రాశారు.పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన పోలవరం నిర్వాసితుల విషయంలో.

 Lokesh Writes Letter To Jagan Lokesh, Ys Jagan,  Lokesh , Ap Poltics , Lokesh Co-TeluguStop.com

ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.పోలవరం నిర్వాసితులు దయనీయ పరిస్థితిలో ఉన్నారని చెప్పుకొచ్చారు.

వారి సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్ కి లెటర్ రాశారు.గతంలో ప్రతి ఎకరాకు 19 లక్షలు ఇస్తామని ఇప్పుడు పది లక్షలు ఇస్తామని మాట మార్చటం దారుణమని పేర్కొన్నారు.

భూమిలేని వారికి పది లక్షల ప్యాకేజీ ఇస్తామని, వలస వెళ్లిన వారికి కూడా ప్యాకేజీ అమలు చేస్తామని, భూమి కోల్పోయిన నిర్వాసితులకు భూమి, పోడు భూమి అయితే పట్టా భూమి.ఇవ్వటం జరుగుతుందని హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.

అయితే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని లోకేష్ విమర్శించారు.ఎకరానికి 1.15 లక్షల పరిహారం ఇచ్చిన భూములకు .ఐదు లక్షలు ఇస్తానని 18 సంవత్సరాలు నిండిన వారికి పరిహారం ప్యాకేజీ ఇస్తామని, దాదాపు 25 రకాల సదుపాయాలతో నిర్వాసితులు అందరికీ ప్రత్యేకంగా కాలనీలు కూడా నిర్మిస్తామని 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించే విధంగా.అప్పట్లో హామీ ఇచ్చారని బహిరంగ సభలో కూడా ప్రకటించారని వాటిని వెంటనే నెరవేర్చాలని సీఎం జగన్ ని లేఖలో లోకేష్ నిలదీశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube