ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వైద్య రంగానికి సంబంధించి సీఎం జగన్ అనేక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.పేదవాడికి విద్య వైద్యం విషయంలో ఎక్కడా కూడా ఏది భారం కాకుండా వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఆరోగ్య శ్రీ పరిధిలోకి గత ప్రభుత్వం కంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక అనేక కొత్త రోగాలు కార్డు లో చేర్చడం జరిగింది.ఇదిలా ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న క్యాన్సర్ రోగుల విషయంలో జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి రెడీ అయింది.
విషయంలోకి వెళితే రాష్ట్రంలో ఉన్న క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స అందించే విషయంలో సలహాదారుడిగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు నీ నియమించడానికి రెడీ అయ్యారు.ఈ మేరకు ప్రభుత్వ వైద్య శాఖకు జగన్ ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగిందట.
క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయ సీఎం ను కలిసిన తర్వాత రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో ప్రత్యేకమైన క్యాన్సర్ అత్యాధునిక ఆసుపత్రులు నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.వీటిలో ఒక ఆసుపత్రిలో అత్యాధునిక టెక్నాలజీ తో.వైద్య సేవలందించడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు స్పష్టం చేశారు.