కళలకు పూర్వవైభవం తీసుకొద్దాం..జిల్లా అధ్యక్షుడు ఎల్లా పోచెట్టి!

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రంలోని స్థానిక ఎల్లమ్మగుడి ఆవరణలో వీర్నపల్లి మండలసాంస్కృతిక కళాసంస్థలసమాఖ్య మండల అధ్యక్షులు నేరేళ్ల ముత్యం గౌడ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశమునకు ముఖ్యఅతిథిగా జిల్లా సాంస్కృతికకళాసంస్థల సమాఖ్య రాజన్నసిరిసిల్లజిల్లా వ్యవస్థాపకఅధ్యక్షులు యెల్ల పోశెట్టి పాల్గొని మాట్లాడుతూ అంతరించిపోతున్న ప్రాచీన కళలనుకాపాడేందుకు అందరూ సహకరించాలన్నారు.

వీర్నపల్లి మండలంలో చాలామంది కళాకారులు ఉన్నారని అన్నారు.జిల్లాకేంద్రంలో వచ్చే నెలలో జరిగే కళాకారుల జిల్లాస్థాయి సదస్సుకు కళాకారులందరూ హాజరై విజయవంతంచేయాలని.

కోరారు.ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మల్లేశం, ఎంపీటీసీ అరుణ్ కుమార్, వీర్నపల్లి సర్పంచ్ శ్రీపాటి దినకర్,మండల కళాకారుల సమాఖ్య ఉపాధ్యక్షులు నీలం రాజేష్ బాబు,ప్రధాన కార్యదర్శి చొక్కి లచ్చయ్య,జిల్లా సమాఖ్యప్రధాన కార్యదర్శి వారాలదేవయ్య, కోశాధికారి బుర్రి శంకరయ్య, జిల్లా సాంస్కృతిక కార్యదర్శి కనపర్తి హనుమండ్లు, జిల్లా ప్రచార కార్యదర్శి సోమినేని బాలు, చందుర్తి మండల అధ్యక్షులు దొంగర్తి లక్ష్మీరాజం, జిల్లా కార్యవర్గ సభ్యులు వీర్నపల్లి కిషన్,జంగా రామ్ రెడ్డి, పెండ్యాల బాల్ రెడ్డి మహిళా కోలాటకళాబృందకళాకారులు, మల్యాల సాయిబాబా, దాదాపు చుట్టుపక్కల గ్రామకళాకారులు 80 మంది వరకు హాజరైనారు.

పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?
Advertisement

Latest Rajanna Sircilla News