Lavanya Tripathi : వరుణ్ తేజ్ తో మళ్లీ నటించబోతున్నారా.. అలాంటి సమాధానం చెప్పిన లావణ్య?

టాలీవుడ్ హీరోయిన్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi )గురించి మనందరికీ తెలిసిందే.

అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు మెగా హీరో వరుణ్ తేజ్ ( Varun Tej )తొలి ప్రేమాయణం నడుపుతూ వచ్చింది.మిస్టర్, అంతరిక్షం ల్లో వీరిద్దరు కలిసి నటించారు.

ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.అయితే ఈ విషయాన్ని అటు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.

అయితే ఎట్టకేలకు ఇద్దరూ ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్దలను ఒప్పించి మరి మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.

Advertisement

గత ఏడాది జూన్‏లో వీరి నిశ్చితార్థంతో అధికారికంగా ప్రేమ విషయాన్ని తెలిపారు.గతేడాది నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలో జరిగింది.అయితే పెళ్లి తర్వాత లావణ్ నటిస్తోన్న మొదటి వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్.

ఈ సిరీస్ తెలుగు హిందీ భాషల్లో వచ్చే నెల 2నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న లావణ్య వివాహం తర్వాత తన లైఫ్ గురించి పలు విషయాలను పంచుకున్నారు.

ఇటీవల మిస్ పర్ఫెక్ట్( Miss Perfect ) ప్రమోషన్లో భాగంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న లావణ్య.విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.మిస్టర్, అంతరిక్షం తర్వాత ఇప్పుడు మీరు మళ్లీ కలిసి నటిస్తారా? అని అడగ్గా.

లావణ్య స్పందిస్తూ.మంచి కథ ఉంటే తప్పకుండా నటిస్తాము అని తెలిపింది.కానీ అది ఎప్పుడూ జరుగుతుందో తెలియదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

కానీ అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే అని తెలిపింది లావణ్య.అలాగే వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ.

Advertisement

తనకు వరుణ్ మంచి లైఫ్ పార్టనర్ అని, చాలా అంశాల్లో తను పర్ఫెక్ట్ అని,ఎప్పుడూ తనను ప్రోత్సహిస్తాడని అన్నారు.ఇక తన నటనను కొనసాగిస్తానని, మెగా కోడలిగా ఉండడం చాలా స్పెషల్ అని నటన విషయంలో అలాంటి వాటిలో నటించు, ఇలాంటివి వద్దు అనే పరిమితులు తన పేరెంట్స్,ఇటు వరుణ్ ఫ్యామిలీ కూడా అలా చెప్పలేదని, కానీ మూవీస్ ఎంపిక విషయంలో తనకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి.

తాజా వార్తలు