ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డి ఈరోజు సాయంత్రం బాధ్యతలను స్వీకరించారు.ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ పదవి విరమణ కావడంతో ఆయన స్థానంలో జవహర్ రెడ్డి నియమితులయ్యారు.2024 జూన్ వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి కొనసాగే అవకాశం ఉంది.ఈ క్రమంలో తనకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇక ఇదే సమయంలో నూతన సి ఎస్ జవహర్ రెడ్డికి అన్ని శాఖలు ఉన్నతాధికారులు తమ అభినందనలు తెలియజేశారు.
సమీర్ శర్మ పదవీకాలం నవంబర్ 30వ తారీకుతో ముగిసింది.
దీంతో ఆయన స్థానంలో జవహర్ రెడ్డిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ క్రమంలో బుధవారం సాయంత్రం జవహర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు.1990 బ్యాచ్ కి చెందిన కె.ఎస్ జవహర్ రెడ్డి వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యంత విధేయుడుగా సానిహిత్యంగా మెలిగిన ఐపీఎస్ అధికారిగా పేరు ఉంది.ఈ క్రమంలో ఆయనను చీఫ్ సెక్రటరీగా సీఎం జగన్ నియమించడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.