ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సినిమాతో సమానంగా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కి ఆదరణ ఉంది.హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సెలబ్రిటీలు అందరూ కూడా సినిమాలతో పాటు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలలో కూడా తమ సత్తా చాటాలని అనుకుంటున్నారు.
దానికి సంబంధించి మంచి కథలని ఎంపిక చేసుకుంటున్నారు.ఇప్పటికే సౌత్ స్టార్ హీరోయిన్స్ చాలా మంది డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లోకి అడుగుపెట్టి వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.
అలాగే యువ నటులు కూడా వెబ్ సిరీస్ లు, వెబ్ ఫిలిమ్స్ ద్వారా తమ సత్తా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.సినిమా అంటే కొన్ని బౌండరీలు ఉంటాయి.
నిర్మాతలు కూడా ప్రేక్షకులని దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా రిస్క్ లు చేయడానికి ఇష్టపడరు.అయితే డిజిటల్ ప్రేక్షకులు కంటెంట్ బేస్ కథలు చూడటానికి ప్రాధాన్యత ఇస్తారు.
ఈ నేపధ్యంలో కొత్త కొత్త టాలెంటెడ్ దర్శకులు, రచయితలకి డిజిటల్ మీడియాలో మంచి అవకాశాలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే తెలుగులో మహేష్ బాబుకి జోడీగా నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ డిజిటల్ మీడియాపై ఆసక్తిని చూపిస్తుంది.
ఒటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.మీడియాతో ముచ్చటిస్తూ ఒటీటీపై తన ఇష్టాన్ని బయటపెట్టింది.ఓటీటీకి ప్రత్యేకంగా ప్రేక్షకులున్నారు.నేను కూడా ఓటీటీలో సినిమాలు చూసి ఎంజాయ్ చేశా.
బాక్సాపీస్ నంబరింగ్ గురించి ఆలోచించే అవసరం లేకుండా నువ్వు ఏం తీయాలనుకుంటున్నావో అది రూపొందించే అవకాశం ఉంటుంది.ఆన్లైన్లోకి వెళ్లిన తర్వాత నంబర్ గురించి మాట్లాడే అవకాశం ఉండదు.
ఓటీటీ ప్లాట్ఫాం కోసం ఏదైనా ఒక ప్రాజెక్టు చేయాలనుకుంటున్నా.చురుకైన పాత్రతో ఇదివరకెన్నడూ చేయని ప్రయత్నం చేయాలనుకుంటున్నట్టు తెలిపింది.