కృష్ణంరాజు మొదటి వర్ధంతి... ఎమోషనల్ పోస్ట్ చేసిన నటి అనుష్క!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా ఎంతో గుర్తింపు సంపాదించుకొని ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వారిలో దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు( Krishnam Raju ) ఒకరు.

ఈయన ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా ఎన్నో సినిమాలను నిర్మించి మంచి గుర్తింపు పొందారు.

అయితే కృష్ణంరాజు వయసు పై పడడంతో గత ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే.

ఇలా కృష్ణంరాజు మరణించి అప్పుడే ఏడాది పూర్తి అయింది.ఈ క్రమంలోనే ఈయన మొదటి వర్ధంతి సందర్భంగా మరోసారి సినీ సెలెబ్రిటీలు ఆయనను గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా కృష్ణంరాజు మొదటి వర్ధంతి సందర్భంగా నటి అనుష్క శెట్టి ( Anushka Shetty ) ఆయనను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

నటి అనుష్కకు కృష్ణంరాజు ఫ్యామిలీ అలాగే ప్రభాస్(Prabhas ) తో ఎంతో మంచి అనుబంధమున్న విషయం మనకు తెలిసిందే.కృష్ణంరాజు గారు మరణించిన సమయంలో అనుష్క కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు.

Advertisement

ఈ క్రమంలోనే ఆయన మొదటి వర్ధంతి (First Death Anniversary) సందర్భంగా అనుష్క సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆయనను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.కృష్ణంరాజు గారు ఎంతో మంచి మనసున్న వ్యక్తి, గొప్ప నటుడిగా ఒక గొప్ప మనిషిగా ఆయన ప్రేమతో మిగిల్చిన జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఈ సందర్భంగా అనుష్క చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇక ఈ పోస్ట్ చూసినటువంటి ప్రభాస్ అభిమానులు అనుష్క అభిమానులు ఈ పోస్ట్ పై స్పందిస్తూ ఆయనకు నివాళులు అర్పించడమే కాకుండా కృష్ణంరాజు గారు అంటే అనుష్కకు ఎంతో ప్రేమ గౌరవం ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు