హైదరాబాద్‌లో కోల్‌కత్తా చూపిస్తోన్న నాని

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘వి’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

అయితే ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు వీలు లేకపోవడంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

పూర్తి రివెంజ్ డ్రామాగా ఈ సినిమా వస్తుండటంతో ‘వి’ ఎలాంటి విజయాన్ని అందుకంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమా తరువాత నాని తన నెక్ట్స్ మూవీలను లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే టక్ జగదీష్ చిత్ర షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.కాగా తన నెక్ట్స్ మూవీని దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్ డైరెక్షన్‌లో రాబోతున్న శ్యామ్ సింఘ రాయ్ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌న ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.

ఈ సినిమా కథ కోల్‌కతా నగరంలో జరుగుతుండటంతో, ఇప్పుడు హైదరాబాద్‌లోని అల్యూమీనియం ఫ్యాక్టరీలో కోల్‌కతా సెట్ వేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఇందులో కోల్‌కత్తా కాళీ టెంపుల్ సెట్ కూడా వేయనున్నారట.

Advertisement

ఇక నవంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగా, వారిలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి నెగెటివ్ రోల్‌లో కనిపించనుందని తెలుస్తోంది.

మొత్తానికి ఈ సినిమాతో మరోసారి నాని ఈ సినిమాతో తన సక్సె్స్ ట్రాక్‌ను కొనసాగించేందుకు రెడీ అవుతున్నాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు